జూన్ 2… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ”తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. వారి కలలను కేసీఆర్ ప్రభుత్వం నిజం చేస్తుందని ఆశిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నా జోహార్లు. అన్నదమ్ములు విడిపోయినా ఎలా కలిసి ఉంటారో, రెండు రాష్ట్ర్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు కూడా అలానే కలసి ఉండాలని, ఆ శిరీడీ సాయినాధుడిని కోరుకొంటున్నా..” అన్నారాయన.