సీమాంధ్రుల భద్రతకు చట్టపరమైన చర్యలు!

తెలంగాణలో సీమాంధ్రుల భద్రతకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటీ, ఐఐఎం సంస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆయన అన్నారు. ఇవాళ తిరుపతికి వచ్చిన వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.