అక్కినేని త్రయం నటించిన చిత్రం ‘మనం’. ఈ శుక్రవారం విడుదలైన మనం క్లాస్, మాస్ అనే తేడా లేకుండా… అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. సినీ సెలబ్రెటీలు కూడా మనం సినిమాకి ఓ అపురూప దృశ్యకావ్యం అంటూ ప్రశంశలు జల్లు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హైరెంజ్ హిట్ అందుకున్న ఈ చిత్రం… ఇప్పుడు హిందీకి వెళుతుందని తెలుస్తోంది. ‘మనం’ చిత్రానికి లభిస్తున్న ఆదరణ చూసిన మీదట ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ హిందీ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.తెలుగులో దీనికి దర్శకత్వం వహించిన విక్రంకుమార్ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తాడట.’హమ్’ పేరిట రూపొందే ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్ బచ్చన్ ముందుకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.ఏఎన్నార్ పాత్రలో ఆయన కనిపిస్తాడనీ, నాగార్జున, నాగచైతన్య పాత్రల్లో వరుసగా అమీర్ ఖాన్, రణభీర్ కపూర్ నటిస్తారని సమాచారం.