భాజాపా గూటికి చిరు.. !

chiru-in-bjp

రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి కమలం గూటికి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే భాజాపా అగ్రనేతల్లో ఒకరు చిరుతో మంతనాలు కూడా జరిపారట. సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ఎన్నికల ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన చిరు.. ఫలితాలపై తీవ్ర నిరాశతో వున్నారు. కాళ్లరిగేలా తిరిగినా.. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ కు గుండుసున్నా పెట్టారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడమే మేలని చిరు భావిస్తున్నారట. పైగా.. విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి చిరు సంపూర్ణంగా సహకరించారని సిమాంధ్ర ప్రజలు ఆయనపై ఆగ్రహంతో వున్నారు.

సీమాంధ్ర ప్రజల అభిమానాన్ని తిరిగిపొందాలన్నా, రాజకీయ జీవితం సాఫిగా సాగాలన్నా.. కమలం గూటికి చేరడమే బెటరని చిరంజీవి భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటి చిరు క్యాంప్ స్పందించలేదు. ఇప్పటి వరకూ.. ఇవే గ్యాసిప్స్ మాత్రమే. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో భాజాపా-తెదేపా కూటమి తరపున ప్రచారం సాగించిన పవన్.. అద్భుతమైన ఫలితాలను సాధించాడు. దేశానికి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వేదికలు పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. చిరు కూడా భాజాపా గూటికి చేరితో బాగుంటుందని అటు మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరీ.. చిరు ఏమంటారో..