ఢిల్లీ చేరుకొన్న చంద్రబాబు

Chandrababu-chennai-tour

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. రేపు (బుధవారం) జరగబోయే ఎన్డీయే సమావేశంలో బాబు పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. దేశానికి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటుగా భాజాపా అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఎన్డీయే లో భాగస్వామిగా వున్న తెదేపాకు కేంద్ర కాబినేట్ లో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో.. బాబు ఢిల్లీ పర్యటన మరింత ప్రాదాన్యత సంతరించుకొంది.