తల్లిదండ్రులకు నివాళి!

chandrababu

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లికు చేరుకున్నారు. గ్రామ ప్రజలు బాబుకు ఘన స్వాగతం పలికారు. బాబు.. తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ-కర్జూరనాయుడుల సమాధుల వద్దకు చేరుకుని వారికి నివాళి అర్పించి… వారి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకు ముందు నారావారిపల్లెలో నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాగా, ఈరోజు ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారి దర్శించుకొన్న విషయం తెలిసిందే.