అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన చిరకాల వాంఛ తీర్చుకొంది సినీ నటి రోజా. చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి వైకాపా తరపున పోటీ చేసిన రోజా…. దాదాపు తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై విజయం సాధించింది. రోజా గెలుపుపై ఎవరికీ పెద్దగా నమ్మకాల్లేవు. ఎందుకంటే ఓసారి కాంగ్రెస్ తరపున, ఇంకోసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది రోజా. దాంతో ఆమెపై ఐరెన్ లెగ్ అనే ముద్రకూడా పడింది. ఈసారి మాత్రం తన గెలుపు కోసం విపరీతంగా శ్రమించింది. వాడవాడలా ప్రచారం చేసింది. దాంతో పాటు రెండు సార్లు ఓడిపోయిందన్న సానుభూతి బాగా పనిచేసింది. తన గెలుపు కబురు వినగానే రోజా ఆ ఆనందం తట్టుకోలేక భోరుమని ఏడ్చేసిందట. ఈ ఐదేళ్లు నగరి నియోజక వర్గ అభివృద్ధికి పాటుపడతానని మాట ఇచ్చింది రోజా.