సంయమనం పాటించండి : బాబు

CBN

హైదరాబాద్ పాతబస్తీ, కిషన్ బాగ్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రజలు ఎవరూ ఆవేశానికి లోను కావద్దని, సంయమనం పాటించి శాంతియుతంగా వుండాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఘర్షణలో మృతి చెందిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని బాబు సూచించారు. కాగా, హైదరాబాద్,  పాత బస్తీ ప్రజలు సంయమనం పాటించాలని తెరాస అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్.. తదితరులు విజ్ఞప్తి చేశారు.