మ‌నం U/A

manam
అక్కినేని కుటుంబ హీరోలు క‌ల‌సి న‌టించిన చిత్రం మ‌నం. ఏఎన్నార్ చివ‌రి చిత్రం కావ‌డంతో యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ మ‌నం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. బిగ్ బీ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తారు. స‌మంత‌, శ్రియ క‌థానాయిక‌లు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుద‌ల చేయ‌బోతున్నారు. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రానికి అనూప్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. మంగ‌ళ‌వారం మ‌నం సెన్సార్ కార్య‌క్ర‌మాల్ని కూడా పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి U/A స‌ర్టిఫికెట్ మంజూరు చేశారు. కుటుంబ‌మంతా క‌ల‌సి చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు… అని చిత్ర‌బృందాన్ని సెన్సార్ బోర్డు అభినందించింది కూడా. మ‌నం విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ఇంకా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయ‌లేదు. క‌నీసం ఆడియో ఫంక్ష‌న్ కూడా నిర్వ‌హించ‌లేదు. అందుకే గురువారం హైద‌రాబాద్లో మ‌నం సంగీత వేడుక నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఒక విధంగా మ‌నం విడుద‌ల‌కు ఇది క‌ర్టెన్ రైజ‌ర్ లాంటిదే. నాగేశ్వ‌ర‌రావు ఎవ‌రు..?? అంటూ విడుద‌ల చేసిన మ‌నం టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.