పోలింగ్ షురూ

pollingతెలంగాణలోని 17 లోక్ సభ, 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 17 లోక్ సభ స్థానాలకు 265 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, 119 అసెంబ్లీ స్థానాలకు 1669 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 30,518 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,81,74,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,934 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 30, 518 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గ్రేహౌండ్స్ బలగాలు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.