‘కొచ్చాడియాన్’తో అభిమానుల్ని పలకరించబోతున్నాడు రజనీకాంత్. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోగా.. మరో సినిమాని సెట్స్పైకి తీసుకెళ్తున్నారు. ఆయన త్వరలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అనుష్క, సోనాక్షి సిహ్హలు కథానాయికలు. ఈ చిత్రానికి లింగా అనే పేరు ఖరారు చేశారు. లింగా అనే పేరుతో రజనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. రజనీ మనవడి పేరు కూడా లింగానే. ఈవారంలోనే మైసూర్లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ త్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ ఉద్యమ నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితులకూ తేడాని లింగా ద్వారా చూపిస్తున్నారట. రజనీ – రవికుమార్ల కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ఆ జాబితాలో లింగా చేరాలని.. రజనీ ఫ్యాన్స్ గంపెడాశలతో ఉన్నారు.