నేను పుట్టాను.. పాటొచ్చేసింది

manam

అక్కినేని నాగేశ్వర్ రావు, ‘కింగ్’నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. అన్న‌పూర్ణ స్టూడియోస్ చిత్రం తెర‌కెక్కించింది. విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఏఎన్నార్‌ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం ప్రేమ్‌న‌గ‌ర్‌ లోని నేను పుట్టాను.. ఈలోకం ఏడ్చింది గీతాన్ని రీమిక్స్ చేస్తున్న‌ట్టు ముందు నుంచీ అనుకొంటూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఈ రీమిక్స్ గీతాన్ని చిత్ర‌బృందం యూ ట్యూబ్ ద్వారా విడుద‌ల చేసింది. ‘పియో పియో రే’ అంటూ సాగే ఈ గీతాన్ని నాగార్జున, నాగ చైతన్యలపై చిత్రీకరించారు. ఈ పాట అక్కినేని ఫ్యాన్స్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకొంటుంద‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కంగా చెబుతోంది. స‌మంత‌, శ్రియ క‌థానాయిక‌లుగా న‌టించారు. సంగిత దర్శకుడు అనూప్ రుబెన్స్ కి ఇది 25వ సినిమా. మే 23న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.