వైకాపా, కాంగ్రెస్ లకు కాలం చెల్లింది !

balayya
వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ లకు కాలం చెల్లిందన్నారు నందమూరి బాలకృష్ణ. రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ లకు కాలం చెల్లిందన్నారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజలంటే ఓటర్లు కాదని.. ప్రజలంటే ప్రభంజనమని పేర్కొన్నారు. టీడీపీ ఎప్పటికీ రైతుల పార్టీయేనన్న బాలయ్య యువతకు ఉద్యోగం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావల్సిందేనని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.