వన్ నేనొక్కడినే లో మహేష్బాబుతో ఆడిపాడింది కృతి సనన్. ఈ సినిమాపై కృతి భారీ ఆశలే పెట్టుకొంది. మహేష్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా చలామణీ అవ్వాలని కలలుకంది. అయితే ఆ సినిమా బాక్సాఫీసుని మెప్పించలేకపోయింది. కథానాయికగా కృతికీ పెద్దగా కలసి రాలేదు. ఇక కృతిని మర్చిపోవచ్చు అనుకొంటున్న దశలో ఆమె పేరు మళ్లీ వినిపిస్తోంది. త్వరలోనే కృతి మెగా హీరోల సరసన కనిపించనున్నదని టాక్. అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం మొన్నే కొబ్బరి కాయ్ కొట్టుకొంది. ఈ చిత్రంలో ఓ కథానాయికగా కృతి పేరు పరిశీలిస్తున్నట్టు టాక్. దాంతో పాటు రామ్ చరణ్ సినిమానీ తన ఖాతాలో వేసుకొనే అవకాశం ఉంది. అదెలాగంటే.. శ్రీనువైట్ల – రామ్చరణ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జులై నుంచి చిత్రీకరణ మొదలెడతారు. ఇందులో కథానాయిగా కృతి అయితే ఎలా ఉంటుంంది?? అని చిత్రబృందం ఆలోచిస్తోందట. ఈ రెండు సినిమాలూ దక్కించుకొంటే కృతి పేరు మరోమారు మార్మోగిపోవడం ఖాయం. ఒక్కటి దక్కించుకొన్నా లక్కుతోక తొక్కినట్టే.