మిర్చి లాంటి హిట్ కొట్టిన తరవాత కూడా యేడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు కొరటాల శివ. మహేష్ బాబు కథ ఓకే చెప్పినా.. ఆ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కాలయాపన జరుగుతూనే ఉంది. ఇంత కాలానికి మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది. జూన్లో ఈ సినిమా సెట్పైకి వెళ్లబోతోంది. తొలుత యూటీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదని చెప్పుకొన్నారు. అయితే.. ఆ సంస్థకు కటీఫ్ చెప్పేశాడు మహేష్ బాబు. ఇప్పుడీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఎర్నేని నవీన్, యలమంచి రవిచందర్ నిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ”నా రెండో సినిమానే సూపర్ః స్టార్ మహేష్బాబుతో చేయడం ఆనందంగా ఉంది. క్లాస్, మాస్, యూత్, ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల్నీ అలరించే చిత్రం ఇది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ కథ.. మహేష్కి సరిగ్గా సరిపోతుంది. త్వరలోనే మిగిలిన వివరాలు ప్రకటిస్తామ”న్నారు దర్శకుడు.