ఇక ప్రచార హోరు..

Chandrababu-chennai-tour

తెదేపా గెలుపు గుర్రాలను ప్రకటించేసింది. ఇక, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి రెడీ అయిపోయింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూకట్ పల్లిలో బాబు ప్రచారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెదేపా, భాజాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తెదేపా వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ అవినీతిలో మునిగిపోయిందని అన్నారు. కాంగ్రెస్ దొంగల ముఠాగా మారిందని బాబు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పుకొచ్చారు. తెదేపా అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని బాబు హామిఇచ్చారు.