ఆన్ లైన్ రెస్పాన్స్ అదుర్స్ !

manam
అక్కినేని హీరోల ‘మనం’ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ లో ‘మనం’ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఉగాది కి రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కు మొదటి రెండు రోజుల్లో 6లక్షల 50వేలకు పైగా క్లిక్స్ వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా నాగర్జుననే జేలియజేశారు. ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ట్రైలర్ చాలా కొత్తగా వుందని రివ్యూస్ వచ్చాయి. నాన్నగారి చివరి చిత్రం ఇది. హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. తప్పుకుండా ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. మనం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలసి చూడదగ్గ సినిమా అన్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. మే 23న రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.