కసిగా పనిచేస్తాం !

Chandrababu
సీమాంధ్రలో నెలకొన్న సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని కసిగా పనిచేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మన రాష్ట్రం… మన భవిష్యత్ నినాదంతో పారిశ్రామికాభివృద్ధి మండలి చేపట్టిన ప్రచార రథాన్ని చంద్రబాబు ఆయన నివాసం నుంచి ప్రారంభించారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలను చైతన్య పరిచేందుకు పారిశ్రామిక వేత్తలు సీమాంధ్ర జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. గత అనుభవాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఏ విధంగా నాంది పలికిందనే విషయాన్ని వారు ప్రజలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… కేంద్రంలో తెలుగుదేశం చొరవతో ఏర్పడిన మూడు కాంగ్రెసేతర ప్రభుత్వాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు అంతకంటే రెట్టింపు అభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని వివరించారు.