లెజెండ్ హిట్ తో ఉత్సాహంలో ఉన్నాడు బాలకృష్ణ. ఈ సినిమా కచ్చితంగా రూ.40 కోట్ల మార్క్ చేరుకొంటుందని నిర్మాతలు ఆశలు పెట్టుకొన్నారు. రూ.40 కోట్లు వసూలు చేస్తే నిర్మాతలు సేఫ్ జోన్ లో పడినట్టే. అయితే… బాలయ్యకు మాత్రం పారితోషికంలో కొంతమొత్తం నిర్మాతలు ఎగ్గొట్టారట. ముందు అనుకొన్నదానికంటే రూ.50 లక్షలు పారితోషికం తక్కువ ఇచ్చారట. `విడుదలైన తరవాత చూద్దాం..` అని అన్నారట. అయితే.. విడుదలైన తరవాత ఆ పారితోషికం గురించి నిర్మాతలు ఏమీ మాట్లాడడం లేదట. బాలయ్య కూడా `సరే.. ఎలాగూ మంచి హిట్ ఇచ్చారు.. ఆ రూ.50 లక్షలు ఇవ్వక్కర్లెద్దు..` అని పెద్ద మనసు చేసుకొన్నాడట. నిజానికి ముందు అనుకొన్న బడ్జెట్ కంటే… నిర్మాతలచేత ఎక్కువే ఖర్చు పెట్టించాడు బోయపాటి. కనీసం రూ.5 కోట్ల తేడా వచ్చిందట. సినిమా రిచ్ గా రావాలన్న తపనతో నిర్మాతలకు కూడా ఖర్చు విషయంలో రాజీ పడలేదట. దాన్ని దృష్టిలో ఉంచుకొనే బాలయ్య రూ.50 లక్షలు వదులుకొన్నాడట.