సీమాంధ్ర అభివృద్ధి తెదేపాకే సాధ్యం : బాబు

tdp-prajagarjana-193x170

పసుపుదళంతో కడప కళకళాడుతోంది. కడపలో ఎక్కడా చూసిన పసుపమయం అయింది. కడప తెదేపా ప్రజాగర్జన ప్రజలతో హోరెత్తింది. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేసి చూపిస్తానో పూసగుచ్చినట్లు చెప్పారు. గతంలో.. తెదేపా అభివృద్ధికి ఏవిధంగా పాటుపడింది. భవిష్యత్ లో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుందో స్పష్టంగా వివరించారు.

చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యంశాలు :

* సీమాంధ్ర అభివృద్ధి బాద్యత తెదేపా తీసుకుంటుంది
* అధికారంలోకి వస్తే రైతుల రుణం తీర్చుకుంటా
* మహిళల రక్షణకు పసుపుదళం ఏర్పాటు
* దేశమంతా ఆశ్చర్యపోయేలా సీమాంధ్ర అభివృద్ధి బాద్యత తెదేపాదే
* డ్వాక్రా రుణాల మాఫీ
* ముస్లింలకు భద్ర
* దేశ ప్రయోజనాల కోసమే భాజాపా పొత్తు
* బడుగు, బలహీన వర్గాలు న్యాయం

చంద్రబాబు ప్రసంగం ఇంకా కొనసాగుతుంది. ప్రసంగంలో బాబు కాంగ్రెస్, వైకాపాలపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ను ఓడించి కడప ఫౌరుషం చూపించాలని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. నీతివంతమైన పోరాటంలో ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు.