కేసీఆర్ పై పొన్నాల ఫైర్

konnalaటీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఏనాడూ అభివృద్ధి గురించి మాట్లాడని కేసీఆర్… ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని ఆరోపించారు. అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కూడా బంగారు తెలంగాణ అంటున్నాడని అన్నారు. రానున్న 20 ఏళ్లలో 70 లక్షల మందికి ఉపాధి కల్పిచే ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా తన ఖాతాలోకి వేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.