ముగ్గురు కాదు.. ఇద్ద‌ర‌మ్మాయిలే!

allu arjunఅల్లుఅర్జున్ – త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. రాదాకృష్ణ నిర్మాత‌. ఈనెల‌లోనే ఈ చిత్రం కొబ్బ‌రికాయ్ కొట్టుకోనుంది. ఈ సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌లున్నార‌నే వార్త చక్క‌ర్లు కొడుతోంది. ఓ క‌థానాయిక‌గా స‌మంత ఎంపికైంద‌ని, మిగిలిన ఇద్ద‌రి కోసం వేట కొన‌సాగుతోంద‌ని చెప్పుకొంటున్నారు. అయితే.. ఈ సినిమాలో క‌థానాయిక‌లు ముగ్గురు కాద‌ట‌. ఇద్ద‌రేన‌ట‌. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం ధృవీక‌రించింది. “మా సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌లున్నార‌న్న‌ది నిజం కాదు. బ‌హుశా.. ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఉంటారేమో. ఇంకా ఎవ‌రినీ అనుకోలేదు. త్వ‌ర‌లోనే వారి పేర్లు ప్ర‌క‌టిస్తాం“ అని చెబుతోంది. ప్ర‌స్తుతం రేసు గుర్రం హ‌డావుడిలో ఉన్నాడు బ‌న్నీ. ఏప్రిల్ 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.