విభజన పూర్తికాలేదట !

Arun-Kumar_EPS విభజన బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందింది. ఆమోదం పొందిన బిల్లుకు రాజముద్ర కూడా పడింది. వేరుకాపురాలు పెట్టడానికి ఆపాయింటెడ్ డేను జూన్ 2గా ప్రకటించారు కూడా. మరోవైపు, పంపకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఎవరైనా ఇంకా విభజన పూర్తికాలేదు అనే ధైర్ఘ్యం చేయగలరా… ?? కానీ.. మన మాజీ ముఖ్యమంత్రి వర్గం మాత్రం అలానే వాదిస్తోంది. తాజాగా, విభజన ఇంకా పూర్తికాలేదని జైసమైక్యాంధ్ర పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ జరగనిదే రాష్ట్ర విభజన జరిగినట్టు కాదని అన్నారు. పనిలో పనిగా తమ పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డిని పొగిడేశాడు. సమైక్యాంధ్ర కోసం కిరణ్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారని అన్నారు. మరీ.. సీమాంధ్ర పజానీకం ఉండవల్లి మాటలను ఏ మేరకు విశ్వసిస్తారు.. ?? వచ్చే ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీకి ఎన్ని సీట్లు కట్టబెట్టనున్నారనే విషయాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే..