నాగార్జున బీజేజీ పార్టీ వైపు దృష్టిసారిస్తున్నారనే వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే నాగ్ బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొన్నట్టు కూడా చెప్పుకొంటున్నాయి. ఈరోజు ఆయన మోడీతో భేటీ కానున్నారనేది నిజమే. అయితే నాగ్ వెళ్తోంది తన కోసం కాదట. అమల కోసమట. అమల గత కొంత కాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. బ్లూ క్రాస్ తరపున విస్ర్కృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకు నాగ్ కూడా సమ్మతించారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే.. బాగుంటుదన్నది ఆలుమగల ఆలోచన. అందుకే నాగ్.. బీజేపీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని సమాచారమ్. మరి అమల ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చూడాలి.