జనంలోకి పవన్

pavan

’జనసేన పార్టీ’ అధినేత పవన్ కళ్యాణ్ ఇక మీదట ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. సభలకు ’యూత్ ఆఫ్ ది నేషన్ – ఫైట్ ఫర్ ది నేషన్’ అనే ట్యాగ్ లైన్ ను కూడా పెట్టేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగో, గీతాన్ని ఇవాళ, లేదా రేపు ఆవిష్కరించనున్నారు.

ఈ నెల 27న విశాఖలో పవన్ నిర్వహించనున్న సభకు యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సభలోనే పవన్, ఆయన స్నేహితుడు స్నేహితుడు రాజు రవితేజ కలసి రాసిన ’ఇజం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. విశాఖ సభ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహించేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాగా, నిన్న (ఆదివారం) పవన్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోటరు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు.