పవన్ లౌకికవాది : చిరు

chiru

సీమాంధ్రలో ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు కేంద్ర మంత్రి చిరంజీవి. సీమాంధ్రలోని 13జిల్లాలో పర్యటిస్తానని చిరు ప్రకటించారు. శుక్రవారం చిరు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీకి కొత్త రాక్తం ఎక్కించేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.

తమ్ముడు పవన్ కళ్యాణ్ భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ కావడంపై చురు సైటర్స్ వేశాడు. పవన్ లౌకికవాదని, అయినా.. మోడీని కలవడంపై తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ఈవిషయం పై పవన్‌ కు అవగాహన ఉందో లేదో తెలియదన్నారు. పనిలో పనిగా మోడీపైన రెండు మాటలొదిలాడు చిరు. గోద్రా అల్లర్ల కేసులో మోడీ ఇంకా అభియోగాలు ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు.

చిరు తీరు చూస్తుంటే.. నెమ్మదిగా పవన్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే.. రోజుకో సటైర్ ని తమ్మునిపైకి వదులుతున్నాడు. రానురానూ.. ఇది మరింత రాజుకునే అవకాశం వుంది. మరీ.. చిరు సటైర్స్ పై పవన్ స్పందనే ఎంటో.. ??