కేసీఆర్ -100అబద్ధాలు!!

kcrతెలంగాణలో తెరాసను అటాక్ చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పై ఎదురు దాడికి దిగాలని యోచిస్తోంది. ఇందుకోసం ’కేసీఆర్-వంద అబద్ధాలు’ అనే పుస్తక రూపకల్పనకు కూడా శ్రీకారం చుట్టింది. తెరాస స్థాపన నుంచి నేటి వరకు కేసీఆర్ చెప్పిన అబద్దాలను ఇందులో పొందుపరచనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు డీఎస్, జానారెడ్డి.. తదితరులతో టీ-పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మ్యయ్య నిన్న విడివిడిగా చర్చలు జరిపారు. ఇక పై కేసీఆర్ పై ఎదురు దాడి చేయాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరీ.. కేసీఆర్ వంద అబద్దాల పుస్తకంలో పేర్కొనే ముఖ్యమైన అబద్దాలు ఏంటీ?? అనే తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.