నాగబాబు తనయుడు వరుణ్తేజ్ సినిమా సెట్స్పైకి వెళ్లబోతోంది. ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈనెల 24 నుంచి కొచ్చిలో కీలక మైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇదో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్. శ్రీకాంత్ అడ్డాల గత చిత్రాలకంటే భిన్నంగా సాగుతుందని సమాచారమ్. గొల్లభామ అనే పేరు ముందు అనుకొన్నా.. ఇప్పుడా స్థానంలో ఆరడుగుల బుల్లెట్ పేరు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ టైటిల్పై చిత్రబృందం అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.