మంచు మోహన్బాబు, విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రౌడీ. శాన్వి కథానాయిక. రాంగోపాల్వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని గీతాల్ని ఈనెల 20న తిరుపతిలో విడుదల చేయనున్నారు. సాయికార్తీక్ స్వరాలు అందించారు. కేవలం 18 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు వర్మ. తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేసినా.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని విష్ణు చెబుతున్నారు. వర్మ దేనిని టార్గెట్ చేశాడో.. ప్రచార చిత్రాలు చూస్తే అర్థమైపోతోంది. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని వర్మ ఓ కొత్తకోణంలో చూపించాడని టాక్. సినిమా అంతా.. ఫ్యాక్షనిజమే లేదు లెండి. రెండ్రోజుల క్రితం రౌడీలోని ఓ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. అందులో శాన్విని అందంగా చూపించాడు వర్మ. మొత్తానికి వర్మ నుంచి ఈ చిత్రంతో ఫుల్ మీల్స్ ఆశించొచ్చు.