చిరంజీవికి ప్రచార కమిటీ అద్యక్ష పదవి

chiruసీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి చిరంజీవి నియమితులయ్యారు. సీమాంద్రలో రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్న భావనతో కాపు సామాజికవర్గానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వాలని బావిస్తోంది. దానికి తగినట్లుగానే చిరంజీవికి ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఇక సీమాంధ్ర ఎన్నికల ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్, మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఆనం రాంనారాయణరెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షురాలిగా పనబాక లక్ష్మిని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.