దళితుడే సీఎం!

jairam-rameshప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిని ఎవరు?? ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతున్న అంశమిది. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని తెరాస అధినేత కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ దారిలోకి కాంగ్రెస్ కూడా వచ్చేసింది. తాజాగా, దళితుడినే తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని కేంద్ర మంత్రి జైరాం రమేష్ హామి ఇచ్చారు. ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న సభలో జైరాం మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే.. దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీల ప్రకటనలతో దళిత నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ జాబితాలో.. దామోదర రాజనర్సింహ, వివేక్, కడియం.. తదితరులు ముందంజలో వున్నారు. మరీ.. పొలిటికల్ పార్టీలు మాట నెలబెట్టుకుంటాయా..?? మాట మార్చకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తాయా..?? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..