కిరణ్ పార్టీని పట్టించుకోం: బొత్స

botsaకిరణ్‌కుమార్‌రెడ్డి నెలకొల్పబోయే పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కంపెనీలను టేకోవర్ చేసినట్లుగా పార్టీలను పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఆయనన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మరో నేత మాజీమంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో 150 పార్టీలు ఉన్నాయని వాటిలో ఒకటిగా కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టే పార్టీని భావిస్తామని అన్నారు.