మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో వాటిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టింది. విభజన తరువాత జరుగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హస్తం పార్టీ. అభ్యర్థుల ఎన్నిక, పొత్తుల అంశంపై పీసీసీ చీఫ్ బొత్స కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించారు. అలాగే పార్టీలోని ప్రముఖులంతా ప్రచారం చేయనున్నారు బొత్స చెప్పుకొచ్చారు. అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు ముందుకొచ్చేదెవరబ్బా..??