రామ్చరణ్ – బోయపాటి శ్రీను కలయిక దాదాపు ఖాయమైనట్టే. దమ్ము తరవాత బోయపాటి శ్రీను రామ్చరణ్కి ఓ కథ చెప్పాడు. అది ఇప్పటికి ఓకే అయ్యింది. ఇటీవల బోయపాటి శ్రీను చరణ్, చిరులను కూర్చోబెట్టి మళ్లీ కథ వినిపించినట్టు సమాచారమ్. ఈసారి బోయపాటికి మెగా క్యాంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దమ్ము సినిమా సమయంలో బోయపాటి శ్రీను రిజిస్టర్ చేయించిన.. రూలర్ అనేటైటిల్ ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన చిత్రమిదని తెలుస్తోంది. లెజెండ్ బయటకు వచ్చిన వెంటనే… బోయపాటి ఈ కథపై కసరత్తులు మొదలెట్టే అవకాశం ఉంది. కృష్ణవంశీ సినిమా మధ్యలో ఉండగానే బోయపాటి శ్రీను సినిమా మొదలవుతుంది.