రాహుల్ తో కేసీఆర్ భేటీ!

rahul-with-kcrకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెరాస అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. టీ-బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో.. కేసీఆర్ రాహుల్ గాంధీని కలసి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ లో తెరాస విలీనంపై వార్తలొస్తున్న నేపథ్యంలో వీరి భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. మధ్యాహ్నం 12.30గంటలకు కేసీఆర్ రష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. కాగా, నిన్న (ఆదివారం) కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలసిన విషయం తెలిసిందే.