టీ-తెదేపా నేతలతో చంద్రబాబు భేటీ!!

t-tdpతెదేపా తెలంగాణ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీఆర్ భవన్ లో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకొంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. అయితే, తెలంగాణ కు ప్రత్యేక అధ్యక్షున్ని నియమించే దిశగా కూడా చర్చలు జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణ ప్రాంతం నుంచి దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి.. తదితరులు రేసులో వుండే అవకాశం వున్నట్లు సమాచారం. మరోవైపు, సోమవారం సీమాంధ్ర నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మొత్తానికి.. ఎన్నికల వ్యూహాలు రచించడంలో తెదేపా నిమగ్నమైందన్నది సుస్పష్టం.