5వ ఐటమ్ గా టీ-బిల్లు!

tbill(2)రాజ్యసభలో ఈరోజు టీ-బిల్లుపై చర్చ జరిగే అవకాశం వుంది.  టీ-బిల్లు 5వ అంశంగా రాజ్యసభ ముందుకు రానుంది. భాజాపా సూచించిన సవరణలపై దృష్టి సారించిన కేంద్రం.. సభలో బిల్లు ఆమోదానికి అనుకూలంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈరోజు ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే సీమాంధ్ర నేతలు జై సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తించారు. గందరగోళ పరిస్థితుల మధ్య  స్వీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.