లోక్ సభ 3గంటలు వాయిదా

t bill in loksabha todayకొద్ది సేపటి క్రితమే ప్రారంభమైన ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభమైన వెనువెంటనే సభ్యులు నినాదాలు చేయడంలో స్పీకర్ మీరాకుమార్ లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక, రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

12. 45 గంటలకు ప్రారంభమైన సభలో హోం మంత్రి షిండే టీ బిల్లు పై చర్చను ప్రారంభించారు. దీంతో సమైక్య నినాదాలు చేస్తూ సీమాంధ్ర నేతలు వెల్ లోకి దూసుకొచ్చారు. సభ సజావుగా సాగకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ సభను 3 గంటకు వాయిదా వేశారు.