పసుపు గర్జన!!

102546243-tdp-chiefపశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో తెదేపా ’ప్రజాగర్జన’ బహిరంగ సభ ప్రారంభం అయింది. సభకు భారీ ఎత్తున ప్రజలు రావడంతో.. తెలుగు తముళ్లు ఖుషి అవుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన ద్వారా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. సభాసాక్షిగా బాబు కాంగ్రెస్ కు సవాల్ విసరనున్నారు. గతంలో.. పలు జిల్లాలో తెదేపా ప్రజాగర్జన మహాసభలను నిర్వహించిన విషయం తెలిసిందే. విభజన రాజకీయం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో.. ఇటీవల కాలంలో ప్రజాగర్జనకు విరామం ఇచ్చారు చంద్రబాబు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో… తెదేపా ప్రజాగర్జన మహాసభలు ఆ పార్టీకి మరింత మైలేజీని ఇచ్చే అవకాశాలు వున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.