ఎంపీలకు ప్రణబ్ చురక!!

pranb mukahriపార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చురక అంటించినంత పనిచేశారు. ఎంపీలు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలని రాష్ట్రపతి సూచించారు. పార్లమెంటు ఉన్నది చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకేనని ప్రణబ్ గుర్తు చేశారు. 15వ లోక్ సభకు ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు కావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సహా పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా రాష్ట్రపతి చేసిన సూచనలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. మరీ..  రాష్ట్రపతి చేసిన సూచనలను ఎంపీలు ఏ మేరకు ఆచరణలో పెడతారో వేచి చూడాలి…