మరోవైపు, కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రిపై సీరియస్ గా వుంది. రాజ్యసభ ఎన్నికల తరవాత సీఎంపై సీరియస్ యాక్షన్ కు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇటీవల టీ-నేతల వద్ద రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ముఖ్యమంత్రి కిరణ్ పై ఫిర్యాదు చేసిన టీ-నేతలతో ఢిగ్గీరాజా.. రాజ్యసభ ఎన్నికల వరకు వేచి చూడండి.. ఆ తరవాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదా.. ! అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మొత్తానికి ఇటు సీఎం కిరణ్, అటు కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పంతాలో వారు వున్నారు. మరీ.. సీఎం రాజీనామా చేసే దాక అధిష్టానం వేచి చూస్తుందా.. ? లేదా.. ఆయన రాజీనామకు ముందే చర్యలు గైకొంటుందా.. ? అనేది వేచి చూడాలి. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అదే సీఎం మార్పు. అదీ.. ముఖ్యమంత్రి రాజీనామా ద్వారానా.. ? లేక అధిష్టానం చర్యల వలనా.. ? అనేది తెలియాల్సి వుంది.