చెన్నై వెళ్లిన చంద్రబాబు!

Chandrababu-chennai-tourతెదేపా అధినేత ఈ ఉదయం చెన్నై బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం 12గంటలకు చెన్నై ముఖ్యమంత్రి జయలలిత, 1.30గంటలకు డిఎంకే అధినేత కరుణానిధితో బాబు భేటీ కానున్నారు. ఆంధ్రపదేశ్ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న కుట్రలను వీరికి వివరించనున్నారు. కాగా, గత రెండుమూడు రోజుల నుంచి చంద్రబాబు జాతీయ పార్టీ నేతలతో సమావేశమవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.