మాట నిలబెట్టుకున్నాం: కిరణ్

kiran2తీర్మానమంటే చిత్తు కాగితమని కొందరంటున్నారని,అది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే బ్రహ్మాస్త్రమని అన్నారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోయాక భారతదేశంలో ఏ రాష్ట్రం ఏర్పడలేదని అన్నారు. కొందరు మూజువాణి ఓటు అంటే తొండి అన్నారని, ప్రజాస్వామ్యంలో 90 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతాయని చెప్పారు. ఇటీవల పార్లమెంటులో పాసైన ఆహార భద్రత, లోక్ పాల్ బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదింపబడ్డాయని తెలిపారు. గతంలో ఏర్పడిన రాష్ట్రాలు కూడా మూజువాణి ఓటుతోనే ఏర్పాటయ్యాయని అన్నారు. దవీ కాంక్షతో సమైక్యవాదులు విభజనవాదులయ్యారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ విధానాలు, పద్దతులు మార్చుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ లో ఓడించి వెనక్కి పంపిస్తామని చెప్పమని అదే చేశామని అన్నారు.