మిర్చి సినిమాతో ఆకట్టుకొన్నాడు కొరటాల శివ. కొత్త దర్శకుడైనా ప్రభాస్ ని చూపించిన విధానం, టేకింగ్ అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమాతో కొరటాల పేరు మార్మోగిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా శివకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఎన్టీఆర్ కి ఓ కథ కూడా వినిపించాడు. అయితే మహేష్ బాబుతో సినిమా ఫిక్సయ్యింది. యూటీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని చెప్పుకొన్నారు. అయితే ఈ సినిమా మళ్లీ మొదటికి వచ్చింది. మహేష్ బాబు తన తరవాతి సినిమా పూరితో చేయాలని ఫిక్స్ అవ్వడంతో కొరటాల ఇంకొంతకాలం ఎదురుచూడక తప్పేట్టు లేదు. మరోవైపు మహేష్కి మణిరత్నంతో ఓ సినిమా చేయాలని వుంది. ‘ఆగడు’ పూర్తయిన వెంటనే మణిరత్నం, పూరిల సినిమాలు మొదలవుతాయి. అంటే కొరటాల సినిమా కొండెక్కినట్టే. కొరటాల మహేష్ కోసం కొంకొన్నాళ్లు ఆగుతాడా? లేదంటే మరో హీరోతో సినిమా లాగించేస్తాడా?? అన్నది మాత్రం చూడాలి.