టీ-బిల్లు ఓడింది!

T-BILL-REJECTEDముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించి పంపారు. ఆందోళన మధ్యే స్వీకర్ నాదెండ్ల టీ-బిల్లుపై ఓటింగ్ పెట్టారు. ముజువాణి ఓటుతో సీఎం కిరణ్ నోటీసుకు ఆమోదం లభించింది. దీంతో.. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పై చర్చ ముగిసిందని స్వీకర్ సభలో ప్రకటించారు. బిల్లుపై చర్చ సందర్భంగా.. 9072 సవరణలు ప్రతిపాదనలు వచ్చాయని,  86 మంది మాట్లాడారని స్వీకర్ వెల్లడించారు. సభను నిరవధికంగా వాయిదా వేశారు.