దిల్ రాజు దగ్గర ఓ స్ట్రాటజీ ఉంది. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తాడు గానీ, మళ్లీ మళ్లీ వాళ్లతో పనిచేయడు. ఒక్క.. భాస్కర్ తోనే రెండో సినిమా తీశాడు. ఆ తరవాత వంశీ పైడిపల్లితో మూడు సినిమాలు తెరకెక్కించాడు. మున్నా, బృందావనం, ఎవడు! ఇప్పుడు నాలుగో సినిమా కూడా అదే బ్యానర్ లో చేయడానికి నిర్ణయించుకొన్నాడని టాక్. పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయడానికి దిల్ రాజు ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కి సరిపడే కథని సిద్ధం చేయమని వంశీకి పురమాయించినట్టు టాక్. వంశీ కూడా దిల్ రాజు ఆఫీసులోనే పవన్ కథ కోసం కసరత్తు చేస్తున్నాడట. పవన్ ని మెప్పించే కథ… వంశీ సిద్ధం చేయగలడా? దిల్ రాజు కలల ప్రాజెక్టు వంశీ సాకారం చేయగలడా?