పెద్దల సభకు నామినేషన్లు దాఖలు!!

mp's rajya sabha candidatesరాజ్యసభ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా రాజ్యసభ అభ్యర్థులు గరికపాటి మోహన్ రావు, తోట సీతామహాలక్ష్మీ నామినేషన్లు దాఖలు చేశారు.కాంగ్రెస్ నుంచి కేవీపీ, సుబ్బిరామి రెడ్డి, ఎం.ఏ. ఖాన్ రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బి-ఫామ్ లను అందజేశారు. కాగా, కాంగ్రెస్ నేత చైతన్య రాజు రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక తెరాస నుంచి కేకే రాజ్యసభకు నామినేషలు దాఖలు చేశారు. తెరాసకు ఎంఐఎం మద్దతు పలికే అవకాశం వున్నట్లు సమాచారం.