వెనక్కి పంపడం ఎలా.. ??

tbillశాసనసభలో హాట్ హాట్ వాతావరణం కనబడుతోంది. సభను సాగినించేది లేదని టీ-నేతలు స్పష్టం చేస్తున్నారు. టీ-నేతల ఆందోళనతో సభ మరో గంటపాటు వాయిదా పండింది. మరోవైపు, సీమాంధ్ర మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. టీ-బిల్లును వెనక్కి పంపడమే లక్ష్యంగా వీరు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, టీ-బిల్లును తిరస్కరిస్తూనే.. దానిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయరాదని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసే తీర్మాణాన్ని ప్రభుత్వం తరుపున శాసనసభలో ముఖ్యమంత్రి తీర్మాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.