రేవంత్ రెచ్చిపోయారు..

revanthఅసెంబ్లీలో టీ-బిల్లుపై హాట్ హాట్ చర్చ కొనసాగుతోంది. తెదేపా నేత రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగుతోంది. రేవంత్ ముఖ్యంగా తన విమర్శానాస్త్రాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎక్కుపెట్టారు. ఇప్పటి వరకు సభలో కిరణ్ ప్రసంగించిన అంశాలపై రేవంత్ కౌంటర్ అటాక్ చేశారు. తెలంగాణ ప్రజలకు త్రాగడానికి కూడా నీళ్లు ఇవ్వని సమైక్య రాష్ట్రంలో ఎందుకు వుండాలని ప్రశ్నించారు. రేవంత్ ప్రసంగం ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగింది.

తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది స్వర్గీయ నందమూరి తారకరామారావేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను బాధల నుంచి విముక్తి కల్పించడం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ మానవతావాదే కానీ, సమైక్యవాది తెలంగాణ వాది కాదన్నారు. 610 జీవో ఇచ్చింది ఎన్టీఆరే అని చెప్పారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల వెనకబాటును ఉదహరిస్తూ.. రేవంత్ రెచ్చిపోయి ప్రసంగించారు.