ఢిల్లీకి రాలేను : సీఎం

cmముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ను రద్దు చేసుకున్నారు. అసెంబ్లీలో టీ-బిల్లుపై చర్చ నేపథ్యంలో.. హస్తనాకు రాలేనని కిరణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు, టీ-బిల్లుపై చర్చ.. తదితర అంశాలపై అధిష్ఠానంతో చర్చించేందుకు కిరణ్ ఈరోజు (శుక్రవారం) ఢిల్లీకి వెళ్లాల్సి వున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని నిన్న దిగ్విజయ్ సింగ్ కూడా ప్రకటించారు. టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగిసిన అనంతరం కిరణ్ కొత్త కుంపటి (కొత్త పార్టీ) పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. సీఎం ఢిల్లీ పర్యటన రద్దుపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధిష్టానాన్ని ధిక్కరించే యోచనలోనే కిరణ్ హస్తినా టూర్ ను రద్దు చేసుకున్నారా.. ? లేదా.. నిజంగానే టీ-బిల్లుపై చర్చలో పాల్గొనాలనే.. ? అన్న విషయాలు చర్చనీయాంశాలు అయ్యాయి.